సీఎం జగన్(CM Jagan) పై ప్రతిపక్ష నాయకుల విమర్శలేమో గాని సొంత చెల్లెళ్లు చేస్తున్న ఆరోపణలు ఆయన ఇమేజ్ను దెబ్బతీస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ వైఎస్ సునీతా(YS Sunita) జగన్పై సంచలన వ్యాఖ్యల చేశారు. ఎక్కువ రోజుల పాటు తలకు బ్యాండేజీ ఉంటే సెప్టిక్ అవుతుందని సెటైర్లు వేశారు. జగన్కు వైద్యులు సరైన సలహా ఇవ్వలేదేమో.. జగన్ త్వరగా బ్యాండేజ్ తీసేయాలంటూ ఓ వైద్యురాలిగా సలహా ఇస్తున్నానంటూ చురకలంటించారు. నామినేషన్ కార్యక్రమం సందర్భంగా జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆమె బదులిచ్చారు. తన తండ్రి వివేకానంద రెడ్డిపై సీఎంకు ద్వేషం ఉందన్నారు. హత్యపై మాట్లాడొద్దని చెప్పి కోర్టుకు వెళ్లిన వారి అదే హత్యపై మళ్లీ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఐదేళ్లుగా తన తండ్రి హత్యపై పోరాడుతుంటే నన్ను కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని సునీత ఆరోపించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- స్టీల్ ప్లాంట్లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రమాదానికి కారణమైన వారిగా భావిస్తున్న 15 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి… మరికొందరిని బదిలీ చేసింది. నాసిరకం మెటీరియల్ కొనుగోలు, పర్యావేక్షణ లోపం, ముందస్తు భద్రతా చర్యలు…
- ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చీమకుర్తి మండలం తొర్రగుడిపాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బత్తుల సుబ్బారావుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. జిల్లాలోని సింగరాయకొండ, ఉలవపాడు ప్రాంతాలకు చెందిన నాలుగు గిరిజన కుటుంబాలను పనుల నిమిత్తం గ్రామానికి రప్పించిన…
- కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరుతో తిరుపతి సమీపంలోని దామినేడులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Total views : 141768