286
ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం కవలకుంట సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీ కొని ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన ముగ్గురిని 108 లో ఎర్రగొండపాలెం సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.





Total views : 62103