ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో ఏజెన్సీ ప్రాంతాల్లో మంత్రి సీతక్క పర్యటన . చిన్న బోయిన పల్లిలో హత్య కు గురి అయిన మహిళా కుటుంబాన్ని పరామర్శించిన సీతక్క ఆర్థిక సహాయం అందించారు, అనంతరం మంగపేట మండల కేంద్రంలోని నర్సింహా సాగర్ గ్రామానికి ఆర్టీసీ బస్ సేవలను సీతక్క ప్రారంభించారు, ఏటూరునాగారం బస్ డిపో ఏర్పాటు, ములుగు జిల్లా కేంద్రంలో మోడల్ బస్ స్టేషన్ ఏర్పాటు చేయాలి అంటూ ఆర్టీసీ అధికారులకు సూచించారు.
ఐటీడీఏ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సీతక్క, అధికారులు నిర్లక్ష్యపు ధోరణి మానుకోవాలని లేదంటే ఉద్యోగం మానేసి వెళ్ళిపొండి అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు మంత్రి సీతక్క. గతంలో పనిచేసినట్టుగా విధులు పట్ల నిర్లక్ష్యం వహిస్తే వెంటనే తొలగించాలంటూ ఐటీడీఏ పీవో కు ఆదేశాలు జారీ చేశారు, ప్రతి మూడు నెలలకు ఒకసారి ఐటీడీఏ లో రివ్యూ మీటింగ్ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశామని అన్నారు, ఐటీడీఏ పరిధిలో ఉన్న గ్రామాల ప్రజల కోసం అధికారులు అవసరం అవుతే వాగులు దాటాలని, గుట్టలు ఎక్కాలని లేదంటే ట్రాన్స్ఫర్ పెట్టుకొని వెళ్ళిపొండి అని అన్నారు సీతక్క. ఏజెన్సీ లో ఇష్టంతో పనిచేసే అధికారులు మాత్రమే ఉండాలని , ప్రజల శ్రేయస్సు కోరే అధికారులు గ్రామాల అభివృద్ది లక్ష్యంగా పని చేయాలని సీతక్క అన్నారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..కార్మికులు, కర్షకులే దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని హోంమంత్రి అనిత తెలిపారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో అనిత పర్యటించారు. కోటవురట్ల మండలం రామచంద్రపురం గ్రామానికి చేరుకున్న మంత్రికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. రామచంద్రపురం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి…
- మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామంలో గ్రామకంఠం భూమిని ఆక్రమించి నిర్మించిన ఇళ్లను కోర్టు ఆదేశాల మేరకు కూల్చివేశారు. భారీ బందోబస్తుతో పోలీసు, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా ఈ…
- అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…అల్లూరి జిల్లా అరకు నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాల్లో రహదారి సమస్యలు ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అరకు, డుంబ్రిగూడ, అనంతగిరి మండలాల్లోని పలు గ్రామాలు ఇప్పటికీ కనీస రహదారి సౌకర్యం లేకుండా ఉన్నాయి. మాడగడ పంచాయతీ పరిధిలోని మెచ్చగూడ గ్రామస్తులు…
- జీటీ ఉత్కంఠభరిత విజయం – తేవాటియా శాంతమైన ముగింపు, గిల్-బట్లర్ ధాటికి ఆర్సీబీ పరాభవం..జీటీ తమ సీజన్ను కొనసాగించేందుకు తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో అద్భుత విజయాన్ని సాధించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం మంచి నిర్ణయంగా నిలిచింది, ఎందుకంటే జీటీ బౌలర్లు ఆర్సీబీ బ్యాటర్లకు తీవ్ర ఇబ్బందులు కలిగించారు. విరాట్ కోహ్లీ రబాడా బౌలింగ్లో వరుసగా…
- గెటప్ శ్రీను వాగ్వాదం! “తొక్కలో ఇంటర్వ్యూ” అంటూ వెళ్ళిపోయిన గెటప్ శ్రీను?ప్రముఖ నటుడు గెటప్ శ్రీను తాజాగా జర్నలిస్ట్ జాఫర్ కు ఇచ్చిన వ్యక్తిగత ఇంటర్వ్యూలో చోటుచేసుకున్న సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మహదేవపట్నంలో జరిగిన ఈ ఇంటర్వ్యూ ప్రారంభంలో సరదాగా సాగిన సంభాషణ, కొద్ది సేపటికే ఉద్రిక్తతకు దారితీసింది.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 62078