Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Andhra Pradesh కుప్పం వైసీపీ రెబల్ అభ్యర్థిగా సై అంటున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

కుప్పం వైసీపీ రెబల్ అభ్యర్థిగా సై అంటున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

by Prakash
kuppam ycp mlc candidate

చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ స్థానానికి పోటీ చేసేందుకు ముందుకొస్తున్న అధికార పార్టీ మొరసనపల్లి గ్రామ సర్పంచ్ జగదీష్ భార్య నీలిమ. తాను ఎమ్మెల్యే అయితే కుప్పంలో నిరుద్యోగ సమస్య, రైతుల సమస్యలను పరిష్కరిస్తానని ముందుకొచ్చింది. కుప్పం అసెంబ్లీ స్తానంలో ఒక మహిళ కూడా ఎమ్మెల్యేగా స్థానం కల్పింలేదు. స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజలకు సేవ చేయడానికే ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్నానని నీలిమ స్పష్టం చేస్తోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు కుప్పం ప్రజలను ఇంకా ఎన్నాళ్ళు మోసం చేస్తారని నీలిమ ప్రశ్నిస్తోంది. అసలు 14 ఏళ్ల సీఎం గా, 35 ఏళ్లు ఎమ్మెల్యేగా చంద్రబాబు కుప్పం ప్రజలకు ఏమి చేసారో చెప్పాలని ప్రశ్నిస్తోంది. ఇక గత నాలుగున్నర సంవత్సరాలుగా ఎమ్మెల్సీ భరత్ కుప్పం ప్రజలకు ఏమి చేసారో చెప్పాలని భరత్ కు నీలిమ సవాల్ విసిరింది. కుప్పం ప్రజలు, మహిళలు ఆలోచించి, తనకు ఎమ్మెల్యేగా ఒక అవకాశం కల్పించాలని కోరిన నీలిమ. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని, తనకు ఒక అవకాశం ఇవ్వాలని నీలిమ కోరారు.

Advertisements

You may also like

Our Visitor

026789
Total views : 151086

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.